తిరుమలకు బయల్దేరిన పవన్ అర్ధాంగి అనా కొణిదెల

  • రేపు సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకోనున్న అనా కొణిదెల 
  • సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి బయటపడిన మార్క్ శంకర్
  • మొక్కు తీర్చుకోనున్న పవన్ అర్ధాంగి అనా
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అర్ధాంగి అనా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆమె ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనా కొణిదల రేపు (సోమవారం) వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడినందుకు ఆమె స్వామివారికి మొక్కులు చెల్లించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

కొన్ని రోజుల కిందట సింగపూర్ లోని ఓ కుకింగ్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం మార్క్ శంకర్ ను తీసుకుని పవన్, అనా కొణిదెల ఇండియా తిరిగొచ్చారు. 

Anna Lezhneva
Pawan Kalyan
Tirumala
Tirupati
Sri Venkateswara Swamy
Mark Shankar
Singapore fire accident
Jana Sena Party
Andhra Pradesh
Telugu Cinema

More Telugu News